సాంకేతిక అగాధంలో మనిషి..
కాలానుగుణంగా సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతూ వస్తుంది. ఒకప్పుడు పచ్చి మాంసం, పండ్లు తినే మనిషి మంటను కనుగొనడడం మానవ చరిత్రలో అతి పెద్ద అభివృద్ధి(?)గా భావించవచ్చు. తరువాతి క్రమంలో ఇంధనాలను మండించడం ద్వారా పారిశ్రామిక రంగాలకు పునాది పడింది. తదుపరి విద్యుత్తును కనిపెట్టడం ద్వారా మానవ, జంతు శ్రమకు బదులుగా విద్యుత్తును వాడుకునే పరికరాలు రూపొందాయి. చివరికి కుట్టు మిషన్లు సైతం విద్యుత్తుని ఉపయోగించి వాడడం జరుగుతుంది.
శ్రమకు ప్రత్యామ్నాయాలు ఎలాగయితే వచ్చాయో మనిషి జ్ఞాపక శక్తి, తెలివికి కూడా ప్రత్యామ్నాయాలు రూపొందిచుకో గలిగాడు. భాష, లిపి వంటివి కమ్యూనికేషన్ ని అభివృద్ధి పరిచింది. కాగితం అందుబాటులోకి రాక ముందు శిలా శాశనాలు, తాళ పాత్ర గ్రంధాల మీద రాసే వారు. క్రమంగా కాగితం, అచ్చు యంత్రము రావడంతో పుస్తకాలూ అందుబాటులోకి వచ్చాయి. పుస్తకాలలో సమాచారాన్ని భద్ర పరచడం వల్ల సమాచారం, విజ్ఞానం(?) ఒక తరం నుండి మరొక తరానికి అందించ గలిగారు. తరువాతి తరాలలో కంప్యూటర్ దానితో ఇంటర్ నెట్ వంటి టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో మనిషి జీవన విధానం మారిపోయింది.
మనిషి జీవన విధానంలో తన శారీరక ఆరోగ్యాన్ని నిలబెట్టే కనీస శారీరక శ్రమకు దూరం అయినట్లే మానసిక ఆరోగ్యాన్ని నిలబెట్టే మానవ సంబంధాలను కూడా కోల్పోయాడు. ప్రస్తుత కాలంలో మనిషి కి - మనిషి కి మధ్య ఏదో ఒక సాంకేతిక పరిజ్ఞానం ఉంటుంది. ప్రత్యక్షంగా మనుషులను కలిసే కంటే సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో సంభాషించ గలుగుతున్నాము. విదేశాల నుండి వీడియో కాల్స్ ద్వారా తమ తల్లిదండ్రులకు, జీవిత భాగస్వాయులకు, పిల్లలకు అందుబాటులో ఉంటున్నారు.
ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ లేదా కంప్యూటర్ వదిలి పుస్తకం చదవడమే ఒక గొప్పగా భావిస్తున్నాము. కానీ ఈ టెక్నాలజీస్ రాక ముందు పుస్తకం కూడా మానవ సంబంధాలను దెబ్బ తీసింది. పూర్వం కొందరిని పుస్తకాల పురుగు అని పిలిచే వారు. వారు పుస్తకాలతో తప్ప నిజ జీవితంలో ఇతరులతో సంబంధాలను ఏర్పర్చుకోవడంలో విఫలం అయ్యేవారు. కానీ నేడు వర్చ్యువల్ ఫ్రెండ్షిప్ తప్ప నిజమైన ఫ్రెండ్స్ లేనివాళ్లు ఎందరో ఉన్నారు.
జీవితం అంటే మన భావోద్వేగాలు (ఎమోషన్స్) వేరే వాళ్ళతో పంచుకోవడం అలాగే వేరే వాళ్ళ భావోద్వేగాలను మనం అర్థం చేసుకోవడం. మన భావోద్వేగాలు ఎవరితో పంచుకుంటున్నామో వారు మనకు సరయిన రీతిలో మన భావోద్వేగాలకు గౌరవం ఇస్తేనే మనం పంచుకో గలుగుతాము. లేని పక్షంలో మనలోనే వాటిని దాచుకోవడం వల్ల తీవ్రమైన మానసిక సంఘర్షణకు లోనవుతాము.
మనిషి ఇతరుల భావోద్వేగాలను అర్థం చేసుకోవడం కంటే తప్పు, ఒప్పులను ఎత్తి చూపడానికి అధిక ప్రాధాన్యతనిస్తాడు. సమాజంలోని చాల సమస్యలకు కారణం ఇదే. ఎదుటి వాళ్ళ భావోద్వేగాలను ప్రక్కన పెట్టి వారి ప్రవర్తనలో తప్పు ఒప్పులను ఎత్తి చూపడం వల్ల ఎదుటి వ్యక్తికీ మనకు మధ్య మానసికంగా దూరం పెరుగుతుంది. ఆ దూరం క్రమంగా ఇరువురి మధ్య అభిప్రాయ భేదాలకు దారి తీసి చివరకు శత్రుత్వం పెరుగుతుంది. ఎవరితో నయితే మీకు సంబంధాలు దెబ్బతిన్నాయో ఒకసారి పరీక్షించుకుంటే వారితో మీరు ప్రత్యక్షంగా కలసి మాట్లాడిన సమయం తగ్గిపోయి ఉండటం గమనించవచ్చు.
అందుకే ప్రస్తుత సమాజంలో సైకాలజిస్ట్స్ అవసరం పెరుగుతుంది. ఒక వ్యక్తి ప్రవర్తనలో తప్పు ఒప్పులు కన్నా భావోద్వేగాలను అర్థం చేసుకోవడం ద్వారా ఆ వ్యక్తి ప్రవర్తనలో మార్పు తీసుకురావడం సులభం. చాలావరకు భావోద్వేగాలు అర్థం చేసుకోలేక పోవడానికి కారణం కమ్యూనికేషన్ లో వాడేటటువంటి టెక్నాలజీ. స్మార్ట్ ఫోన్స్, చాటింగ్ వంటివి కేవలం సమాచారాన్ని చేరవేస్తాయి తప్ప భావోద్వేగాలను పూర్తిగా అర్థం అయ్యేలాగా చెయ్యలేవు.
కాబట్టి మనిషి స్మార్ట్ ఫోన్స్, కంప్యూటర్స్, బుక్స్ ప్రక్కన పెట్టి సాటి మనిషితో ప్రత్యక్షంగా కలవాల్సిన అవసరం ఉంది. కేవలం సాటి మనిషితోనే కాదు ప్రకృతితో ప్రత్యక్ష సంబంధాలను మనిషి ఏర్పరుచుకోవాలి. సాటి మనిషిలో, పక్షిలో, జంతువులో, మొక్కలలో సైతం తనను చూసుకోగలిగిన వారికి జీవన మాధుర్యం అర్థమవుతుంది.
- హరి రాఘవ్
Keywords : life, psychology
(08.03.2018 06:24:54am)
No. of visitors : 1581
Suggested Posts
10 results found !
| నిజం ఆవస్యకతనిజాన్ని తెలుసుకోవడం అవసరమే. కానీ ప్రతీ నిజాన్ని తెలుసుకోవడం వల్ల జీవితం వృధా అవుతుంది. జ్ఞానం అనంతం. మనిషి జీవితం పరిమితం. పరిమిత జీవితకాలంలో చాలా వరకు తనకు తెలియకుండా సమాజ ప్రభావంతో కొట్టుకుపోతాడు. తనకు అర్థమయ్యింది అనుకునే లోపే తను అర్థం చేసుకున్నదంతా తప్పని అర్థమవుతుంది.
మనిషి తన మానసిక జీవితానికి సంబంధం లేని ఏ నిజాన్ని తెలుసుకున్నా అది వృధానే. అంత |
| నిజాలన్నీ అబద్దాలేమనిషి ప్రతీ క్షణం తన గతం నుండి భవిష్యత్తులోకి ప్రయాణం చేస్తూనే ఉంటాడు. జీవం ఉన్నంత వరకూ తనకు ఇష్టం ఉన్నా, లేకున్నా తన జీవితంలో మార్పు సంభవిస్తూనే ఉంటుంది. కాబట్టి #నేనెవరు? అన్న ప్రశ్నకు మనిషి దగ్గర ఎప్పటికీ సమాధానం ఉండదు. నేను ఫలానా అని చెప్పింది కేవలం తన గతం నుంచి తీసుకున్న కొంత భాగం లేదా ప్రస్తుతంలో తను అనుకున్న, చెప్పిన లక్షణం మాత్రమే.
ప్రతీ మనిషి త |
| జీవితంఆధునిక కాలంలో మనిషి తన జీవితంలో ఎదురయ్యే ఆనందాన్ని అనుభవించడం కన్నా, తను ఆ స్థితికి చేరుకున్నాని ఇతరులకు తెలియజేయడంలో ఆనందాన్ని వెతుక్కుంటున్నాడు. అనుకోకుండా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడినా లేదా ఏదైనా విహార యాత్రకు వెళ్ళినా ఆ అందమైన అనుభూతులను ఆస్వాదించ కుండా అక్కడ సెల్ఫీలు ఎలా తీసుకుంటే బాగుంటదో అనే ఆలోచనలే వారి మనస్సులో మొదలవుతాయి. |
| మనిషి జీవితం జీవించడానికా? శోధించడానికా?ఇతర జంతువులకు లేని అద్భుతమైన జ్ఞాపక శక్తి, సృజనాత్మక శక్తి మనిషికి లభించింది. అదే సమయంలో మనిషి ఆ జ్ఞాపక శక్తి, సృజనాత్మక శక్తి మనిషిని అనంతమైన దుఃఖంలోకి నెట్టివేస్తుంది. లభించిన సమాచారంలో అవసరమైనదేదో అనవసరమైనదేదో తేల్చుకోలేక ప్రతీ సమాచారాన్ని పరిగణలోకి తీసుకొని అవసరం లేని భయాలను, వేదనను పెంచుకోవడంలో మనిషి సిద్ధహస్తుడు. మనిషి తనకున్న భయాల నుంచి ఒక అభయం క |
| పోరాటమా? బ్రతుకా?మెయిన్ స్ర్టీమ్ మీడియా లాగా కాకుండా ఫేస్బుక్ గ్రూప్స్ లోను, ఇతర సామాజిక మాధ్యమాలలోను ప్రతీఒక్కరు స్పందించే అవకాశం ఉంటుంది. ఇది ఒక మంచి పరిణామం. ఏ సమస్యకయినా పరిష్కారం కనుగొనడంలో చర్చించడం ఒక ఉన్నతమయిన మార్గం. అయితే ఇందులో ఉన్న ఇబ్బంది ఏంటంటే చాలామంది చర్చల వరకే పరిమితం అవుతారు. |
| భార్యభర్తల మధ్య విభేదాలకు కల్చర్ ఎలా కారణమవుతుంది? వైవాహిక జీవితంలో కులాంతర, మతాంతర, ప్రాంతాంతర అంశాలు ప్రభావితం చేస్తాయా? ఒకవేళ అటువంటి అంశాలుంటే వాటిని ఎలా ఎదుర్కోవాలి? క్రాస్ కల్చర్ మ్యారేజ్ లలో చిన్నచిన్న ఇబ్బందులను సరయిన రీతిలో అర్థం చేసుకోకపోతే ఎలా జీవితాల మీద ప్రభావితం చేసే అవకాశం ఉంది? |
| ఆనందం నీ ఛాయస్ఈ విశ్వంలో జరిగిన ప్రతీ సంఘటనకు వెనుక ఏదో ఒక కారణం ఉంటుంది. కారణం లేకుండా ఏదీ జరగదు. అయితే జీవించడానికి మాత్రం ఏ కారణం అవసరం లేదు. చాలామంది తామ జీవితం దుర్భరంగా మారినపుడు అసలు తాము ఎందుకు జీవిస్తున్నామో అర్థం కావడం లేదు అని అంటుంటారు. కొందరి వైవాహిక సంబంధాలు దెబ్బతిన్నపుడు పిల్లల కోసం జీవిస్తున్నట్లు చెప్పుకుంటారు. కానీ వ్యక్తి తన జీవితం ఎప్పుడూ తన కోసమ |
| ఆనందపు తలుపులుమనిషి జీవితానికి పరమార్థం వెతికే పనిలో పడతారు కొందరు మేధావులు. హాయిగా జీవించడమే తప్ప మారే పరమార్థం ఉండేది తెలుసుకుంటారు అందులో కొందరు. భార్య పిల్లలను వదిలి జ్ఞానం కోసం వెళ్లిన బుద్ధుడు ప్రపంచాన్ని గురువు, దేవుడు అయ్యాడు. కానీ ఆ భార్య పిల్లల దృష్టిలో బుద్ధుడు వేరు. సమాజంలో ఉన్న స్థితిని మరచి, ఉన్న భాద్యతలు మరచి భవిష్యత్తుకు ఇతరులను వదిలి వెళ్లడం వల్ల సమాజ |
| లైఫ్ ఛేంజింగ్ ఇయర్ - 2018మిత్రువులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ రోజు నుండి నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. నిజానికి ప్రకృతిలో ఏదీ మారదు. మారాల్సింది మనం. మార్పు రావలసింది మన ఆలోచన విధానంలో. మనం మారితే ప్రపంచం మారుతుంది. మనం మారితే తోటి వారిలో మార్పు వస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు గమనించాల్సిన విషయం ఇది. మనం సమర్థవంతంగా మన టైం ని మేనేజ్ చేసుకోకుండా ఏవో వంకలు వెతుక్కోవటం లోన |
| మరణంఒక మితృడి సోదరి మొన్న సాయంత్రం కాన్సర్ తో మరణించింది. మానసికంగా ఎంతో పరిపక్వత గల మిత్రుడు తన సోదరి పట్ల చాల అట్టాచ్డ్ గా ఉండేవాడు. ఆ బాధ నుంచి ఉపశమనం కోసం నాకు ఫోన్ చేసి కొంచెం సేపు తనతో ఉండవలసిందిగా కోరాడు. ఎన్నో సంవత్సరాల నుండి మేము ఎన్నో విషయాలు కొన్ని వందల గంటలు చర్చించాము. కానీ నిన్న అతని తో గడిపి మేము డిస్కస్ చేసిన విషయాలు మనిషి జీవితం పట్ల చాల స్ప |